Thursday, May 16, 2024

సీఎం కేసీఆర్ ప్లెక్సీకి పాలాభిషేకం

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు జీవితాంతం రుణపడి ఉంటామని గీత కార్మికులు బుధవారం జిల్లావ్యాప్తంగా పాలభిషేకాలు నిర్వహించారు. రైతాంగానికి రైతు బీమా అమలు చేస్తున్న తరహాలోనే కల్లుగీత కార్మికుల కోసం గీత కార్మికుల బీమా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. కల్లు గీస్తూ ప్రమాదంతో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుడి కుటుంబానికి రూ.5లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకోవడంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె సంతోష్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, కొండం రాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement