Sunday, May 5, 2024

21న మునుగోడుకు అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మునుగోడుకు రానున్నారు. ఈ మేర‌కు పర్యటన తేదీలు కూడా ఖరార‌య్యాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నాయ‌కులు ఈ నెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3.40 గంలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేర‌కుని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 4.15కు మునుగోడుకు చేరుకుంటారు. మునుగోడు సభలో అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు. తిరిగి అమిత్ షా మునుగోడు నుంచి హెలికాప్టర్‌లో 6.25 గంలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని 6.30 గంలకు ఢిల్లీకి పయనమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement