Wednesday, May 8, 2024

NLG: వేతనాలు ఇవ్వలేదని… విధులు బహిష్కరించిన మున్సిపల్ కార్మికులు

మోత్కూర్, ఫిబ్రవరి 8 (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో 41 మంది పారిశుద్ధ్య కార్మికులు తమకు 2నెలల (నవంబర్, జనవరి) వేతనాలు అందక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురౌతున్నామని, తక్షణమే వేతనాలు చెల్లించాలని కోరుతూ గురువారం 2 వ రోజు విధులు బహిష్కరించి స్థానిక అంబేద్కర్ చౌరస్తా లో నిరసన వ్యక్తం చేశారు.

2 రోజులుగా మెయిన్ రోడ్లపై పారిశుద్ధ్య కార్మికులు చెత్తాచెదారం శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా మారి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా కన్పిస్తున్నాయి. తక్షణమే అధికారులు జోక్యం చేసుకొని కార్మికులకు వేతనాలు చెల్లించి, మున్సిపల్ ప్రజల అసౌకర్యాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement