Tuesday, May 21, 2024

వికలాంగులకు కృత్రిమ కాళ్ళు పంపిణీ

ప్రమాదంలో కాలు కోల్పోయిన బాధితులకు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కృత్రిమ కాళ్లు పంపిణీ చేశారు. యదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం గ్రామానికి చెందిన వెంకటేష్, వాసుపురి పరమేష్,  వాసుపురి రమేష్ లకు ఇటీవల జరిగిన ప్రమాదంలో తమ కాలు పోయాయి. దీంతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహాయ సహకారాలతో నిమ్స్ ఆసుపత్రి నుంచి రూ. 1 లక్షా 50 వేల రూపాయల విలువగల కృత్రిమ కాళ్ళను బాధితులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు రావుల శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement