Thursday, May 2, 2024

NLG: గురుకుల పాఠశాల మంజూరు… కేసీఆర్ కు ఎమ్మెల్యే కూసుకుంట్ల కృతజ్ఞతలు

సంస్థాన్ నారాయణపురం, జులై 31 (ప్రభ న్యూస్): మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సంస్థాన్ నారాయణపురం మండలానికి గిరిజన గురుకుల పాఠశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం నారాయణపురం మండల కేంద్రంలో ఆయన గిరిజన గురుకుల పాఠశాల కోసం భవనాన్ని పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు.

సుమారు 400 మంది గిరిజన విద్యార్థులకు విద్య అందుతున్నట్లు తెలిపారు. అందుకు గాను నారాయణపురం మండల కేంద్రంలోని భవనాన్ని పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మునుగోడు నియోజకవర్గం అభివృధిలో మరింత ముందుకు పోతుందని, ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి భానుమతి వెంకటేష్, సర్పంచ్ శ్రీహరి, పిఎసిఎస్ చైర్మన్ జంగారెడ్డి, వైస్ ఎంపీపీ రాజు, ఎంపీటీసీ గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement