Tuesday, April 30, 2024

యాదాద్రిలో మే డే వేడుకలు

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17 మండలాలు, మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల కార్మిక విభాగం ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారాస కార్మిక విభగం నేతలు జెండాలను ఎగురవేశారు. ఆలేరులో సీఎల్పీ నేత పీపుల్స్ మార్చ్ లో భాగంగా జెండాను ఎగరేసి కార్మికులకు మే డే శుభాకంక్షాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్ల ఐలయ్య, కల్లూరి రామచంద్రా రెడ్డి, బండ్రు శోభారాణి, కుడుదుల నగేష్, ఉపేందర్ రెడ్డి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement