Monday, April 29, 2024

పేద కుటుంబానికి దక్కిన ఎస్సై ఉద్యోగం..

డిండి, (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన ఎస్సై ఫలితాల్లో డిండి మండలం డాక్య తండ పేద కుటుంబానికి చెందిన గిరిజన విద్యార్థి వడిత్య హరి చందు, నాజుల కుమారుడు గణేష్ నాయక్ విజయం సాధించాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ తమ కుమారుడు ఉద్యోగం సాధించాలని పట్టుదలతో చదివించారు. తాము కూలి పని చేసిన తమ కుమారుడు మంచి ఉద్యోగం సాధించాలని చదివించామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గణేష్ ఎస్సై ఉద్యోగం సాధించడంతో తండావాసులు ఆనందం వ్యక్తం చేశారు వీరి కుటుంబం నుండి వడిత్య దీప్లా కుమారుడు ప్రదీప్ కుమార్ ఎస్ఐ గా ఉద్యోగం చేస్తూ గత నెల సీఐగా ప్రమోషన్ పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement