Friday, April 26, 2024

ముగిసిన నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక నామినేష‌న్ల ప‌ర్వం..

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులంతా త‌మ త‌మ‌ నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నోముల భగత్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జానారెడ్డి, బీజేపీ అభ్యర్థి పానుగోతు రవికుమార్‌, టీడీపీ అభ్యర్థి మువ్వా రవికుమార్ లు నేడు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు… కరోనా నేపథ్యంలో అభ్యర్థులు కొద్దిమంది నేత‌ల‌తో క‌ల‌సి నిడమనూరు తాసిల్దార్‌ కార్యాలయంలో ఆర్డీఓ రోహిత్‌ సింగ్‌ అభ్యర్థుల నుంచి నామినేషన్లు అంద‌జేశారు.. ప్ర‌ధాన అభ్య‌ర్ధులు కాకుండా మొత్తం మీద 45 మంది వ‌ర‌కు త‌మ నామినేష‌న్లు వేశారు.. రేపు నామినేష‌న్ల ప‌రిశీల‌న ఉంటుంది..నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఏప్రిల్‌ 3 వరకు గడువు ఉంది. ఏప్రిల్‌ 17న ఎన్నికల పోలింగ్, మే 2న ఓట్లు లెక్కిస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement