Tuesday, April 30, 2024

యాదాద్రిలో గులాబీ సంబురం.. ఊరంతా పండుగే

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి : అమరుల స్ఫూర్తితో గులాబీ సైనికులు ముందుకు సాగాలని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి సాయి కన్వెన్షన్, వంగపల్లి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ఫంక్షన్ హాల్లో ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి భారీ సంఖ్యలో ప్లీనరీకి తరలివచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. నియోజక వర్గాల్లో నాడు- నేడు ఫోటో షూట్ ను ప్రదర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరుల ఆశయాలను గుర్తు చేస్తూ మౌనం పాటించారు.

ఎమ్మెల్యేలు మాట్లాడుతూ… అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు సీఎం కేసీఆర్ అని పొగిడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆత్మీయ సమ్మేళన జిల్లా ఇంచార్జ్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, అమరేందర్, ఆంజనేయులు, గడ్డమీది రవీందర్, శ్రీకర్ రెడ్డి, గొల్లపల్లి రాంరెడ్డి, ఆర్కాల గాల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పింగల్ రెడ్డి, జనగాం పాండు, జక్క రాఘవేందర్ రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement