Saturday, April 27, 2024

రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ : మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

నల్గొండ : భారత దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్క‌ర్ దేశానికి చేసిన సేవ‌ల‌ను గుర్తు చేశారు. దేశంలో అంద‌రూ స్వేచ్ఛ‌గా జీవించే హ‌క్కు రాజ్యాంగం ద్వారా క‌ల్పించార‌న్నారు. యువ‌త అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు. ఆయ‌న అడుగు జాడ‌ల్లో న‌డ‌వాల‌న్నారు. అంబేద్కర్ స్పూర్తి, ఆలోచన, ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. విద్యను అన్ని వర్గాల ప్రజలకు అందించడం అంబేద్కర్ ఆశయం అని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement