Thursday, March 28, 2024

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడు పోరు.. స్పీక‌ర్ పోచారం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కొందరు ఆశపడుతున్నారని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరూ డబ్బులకు అమ్ముడు పోరని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తన నియోజకవర్గంపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ వారి ఆశ మాత్రం నెరవేరనివ్వమన్నారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement