Saturday, April 27, 2024

ఏపీఎస్ఆర్టీసీ బస్సులో 30 కిలోల గంజాయి స్వాధీనం

ఏపీఎస్ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల గంజాయిని సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేతేపల్లి టోల్‌గేట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో 30 కిలోల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణ ప్రయాణికుల మాదిరిగా నిందితులు టిక్కెట్లు తీసుకున్నారని.. గంజాయి తరలిస్తున్నట్లు తమకు తెలియదని బస్సు డ్రైవర్, కండక్టర్ పోలీసులకు వివరణ ఇచ్చారు. అయితే ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. ఎక్కడికి తరలిస్తున్నారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement