Tuesday, April 16, 2024

ఏపీ కరోనా అప్ డేట్: కొత్తగా 1,246 కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 55,323 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1,246 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,450 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. మరో 10 మంది మృతి చెందారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,44,490కి చేరింది. ఇందులో 20,16,837 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,535 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 14, 118 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ వల్ల చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement