Saturday, May 4, 2024

Munugoduలో నామినేష‌న్ వేసిన బిఆర్ఎస్ అభ్య‌ర్ధి కూసుకుంట్ల

చౌటుప్పల్, నవంబర్ 9 (ప్రభ న్యూస్) : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి గురువారం అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు నామినేష‌న్ దాఖ‌లు చేశారు.. ఈ సంద‌ర్బంగా చౌటుప్పల్ నుండి వివిధ మండలాల మీదుగా చండూరుకు పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ కార్యాల‌యానికి వెళ్లారు.. అక్క‌డ రిట‌ర్నింగ్ అధికారి దామోదర్ రావుకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. కూసుకుంట్ల వెంట రాష్ట్ర కల్లుగీత కార్పోరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement