Thursday, April 25, 2024

ఈటల గెలుపుతో ముదిరాజు యువత సంబరాలు

పానుగల్ (ప్రభ న్యూస్): ఉప ఎన్నికల్లో ఈట‌ల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవడం తో అభిమానులు, బీజేపీ కార్య‌క‌ర్త‌లు సంబురాలు నిర్వ‌హిస్తున్నారు. పాన్‌గ‌ల్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ భవన్ నుంచి పాన్ గల్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప‌టాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

కార్యక్రమంలో మత్స్యకార సంఘం అధ్యక్షుడు తాళ్ల ఆనందం, సెక్రటరీ గెంటీల బిచన్న , సింగోటం ముదిరాజ్ మండల కమిటీ కార్యదర్శి తిరుపతి, రాజు, అంజనేయులు, భగవంతు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement