Thursday, May 16, 2024

గుండెపోటుతో ముథోల్​ డిప్యూటి తహసీల్దార్​ మృతి…

నిర్మల్ జిల్లా ముథోల్​ డిప్యూటి తహసీల్దార్​ సయ్యద్​ ఆసీఫ్​ (50) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం విధులు నిర్వహించిన అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన భోజనం చేసి నిద్రించారు. నిద్రావస్థలోనే గుండెపోటు భారిన పడి ఆయన మృత్యువాత పడ్డారు. బుధవారం ఉదయం 8గంటల వరకు సయ్యద్​ ఆసీఫ్​ బయటకు రాకపోవడాన్ని గుర్తించిన ఇంటి యాజమాని పిలిచినప్పటికీ స్పందన రాలేదు. దీంతో తెరిచి ఉన్న కిటికి నుంచి లోపలికి చూడగా.. డిప్యూటీ తహసీల్దార్​ సయ్యద్​ ఆసీఫ్​ అపస్మారక స్థితిలో పడి కనిపించాడు. వెంటనే యాజమాని సంబంధిత విషయాన్ని తహసీల్దార్​ కార్యాలయం సిబ్బందికి సమాచారం అందించారు. వారందరూ ఇంటికి వచ్చి తలుపులు తొలగించి చూడగా అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నాడు.

సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని విద్యానగర్​ కాలనీకి చెందిన సయ్యద్​ ఆసీఫ్​ గత ఏడాదిన్నర కాలంగా ముథోల్​ తహసీల్​ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్​ గా పని చేస్తున్నాడు. డిప్యూటీ తహసీల్దార్​ మృతి చెందిన సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్​ వరుణ్​ రెడ్డి హుటాహుటిన ముథోల్​ కు తరలివెళ్లారు. అక్కడి రెవెన్యూ సిబ్బందికి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహానికి నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement