Thursday, May 16, 2024

పళని ఆలయాన్ని సందర్శించిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు

త‌మిళ‌నాడు – రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ దంపతులు తమిళనాడులోని పళని సుబ్రమణ్యస్వామి (దండయుతస్వామి) ఆలయాన్ని సందర్శించారు. స్టడీ టూర్ లో పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం తమిళనాడులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంఘంలో సభ్యునిగా ఉన్న ఎంపీ రవిచంద్ర ఛైర్మన్ రమేష్ విధూరియ,ఇతర సభ్యులతో కలిసి మంగళవారం సుబ్రమణ్యస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు, వేదపండితులు ఆశీర్వచనాలు పలికి శాలువాతో సత్కరించారు, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ పుణ్య దంపతుల వెంట కుమారుడు వద్దిరాజు ప్రీతమ్ ఉన్నారు. అంత‌కు ముందు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వారికి ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో అపూర్వ స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement