Sunday, April 28, 2024

TS: ఏ తల్లి కన్న బిడ్డో… ముళ్లపొదల్లో చిన్నారి కేరింతలు..

సూర్యాపేట, ప్రభ న్యూస్ : సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా.. ఇంకా ఆడపిల్లలను వదిలించుకోవాలని చూస్తున్నారు. ఆడపిల్లలు లేకుంటే సమాజంలో మగవారు ఉంటారా.. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్ల పొదల్లో వదిలివేసిన తల్లికి పలువురు శాపనార్థాలు పెడుతున్నారు.


108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం…
నెమ్మికల్ గ్రామ చెట్ల పొదల్లో అర్ధరాత్రి వేళ అప్పుడే ఆడ శిశువును కన్నతల్లి వదిలి వేసినట్లు తెలుస్తుంది. సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన వారు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది రమేష్ చిరంజీవి వెళ్లి పాపను ప్రథమ చికిత్స చేస్తూ సూర్యాపేట మాతాశిశు ఆస్పత్రి సిబ్బందికి అప్పగించారు. పాప క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement