Thursday, May 2, 2024

వాగులో తల్లి కూతుర్ల గల్లంతు – కుమార్తెని కాపాడిన స్థానికులు

ములకలపల్లి, జూలై 26(ప్రభ న్యూస్): వాగు దాటుతుండగా వరదనీటి ప్రవాహానికి తల్లి కూతుర్లు కొట్టుకుపోయిన సంఘటన బుధవారం సాయంత్రం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని చాపరాల పల్లి గ్రామం నుండి కుమ్మరిపాడు గ్రామానికి వెళ్లే రహదారిపై ఉన్న వంతెనపై భారీ వర్షాలకు వరద నీరు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో అదే రహదారిపై ప్రయాణిస్తున్న కుంజా సీతమ్మ (45), కోర్స జ్యోతి లు పలువురు స్థానికుల సహాయంతో వాగు దాటుతుండగా అదుపుతప్పి ఇద్దరూ జారిపడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

స్థానికులు వెంటనే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారిని గమనించి కూతురిని రక్షించగా తల్లి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. స్థానికులు ఆమె కోసం పోలీసులు సహాయంతో గాలిస్తున్నారు. దీంతో మండలంలో విషాదం అలముకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement