Monday, April 29, 2024

కేసీఆర్ ని అడ్డం పెట్టుకొని రాజ‌కీయం చేస్తున్న మోడీ : జ‌గ్గారెడ్డి

ప్రధాని నరేంద్రమోడీ కేసీఆర్ ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నార‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… తెలంగాణ మంత్రులు కొత్త డ్రామా ఆడుతున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారు కాబట్టి బీజేపీ-టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోలు వెనుక బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ కుట్ర వుందని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి పోతేనే సమస్య పరిష్కారం కాలేదు.. మంత్రుల వల్ల ఏం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. వరి ధాన్యం కొనుగోలు వెనక కుట్ర వుందన్నారు. మోడీ, కేసీఆర్ తెలంగాణ రైతుల జీవితాలతో రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. త‌మ కోసం కొట్లాడుతున్నారని రైతులను మభ్యపెట్టేందుకు టీఆర్‌ఎస్ మంత్రులు డ్రామాలాడుతున్నార‌ని జగ్గారెడ్డి అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement