Tuesday, May 7, 2024

శ్రీవారి సేవలో ఎమ్మెల్సీ కవిత

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిమరుల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న అలిపిరి కాలినడక మార్గం గుండా కవిత తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, తిరుపతి నగర శివార్లలోని మంగళంలోని ఓ వృద్ధాశ్రమంలో కవిత తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement