Friday, April 26, 2024

బ్రెస్ట్ క్యాన్సర్ పై జాగ్రత్తగా ఉండాలి: కవిత

బ్రెస్ట్ క్యాన్సర్ పై జాగ్రత్తగా ఉండాలి: కవిత

బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత సమాజంలో మనందరిపై ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని MNJ క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ వాక్ ను ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గతంలో 60 ఏండ్ల పైబడిన వాళ్లకు వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తుందని తెలిపారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కుటుంబ సభ్యుల మీద కూడా ఉందన్నారు. ఆడపిల్లలకు తప్పకుండా ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించడంతో పాటు, జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని తెలిపారు. తల్లి, చెల్లి, భార్య ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత కోరారు.  ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎమ్ఎన్‌జే క్యాన్సర్ ఆస్ప‌త్రిలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన ఆస్ప‌త్రి ఇంచార్జీ జయలలితకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: మా ఎన్నికల్లో అతన్నే గెలిపించండి: ప్రకాశ్​రాజ్ పై కోటా సంచలన కామెంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement