Tuesday, April 30, 2024

NZB: కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యేలు…

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 19 (ప్రభ న్యూస్): బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల శాసనసభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలను జిల్లా పాలనాధికారి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ తో భేటీ సందర్భంగా తమతమ నియోజకవర్గాలలో నెలకొన్న ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement