Monday, April 29, 2024

Power Point – మాకు ఆ అవ‌కాశం ఇవ్వండి….స్పీక‌ర్ కు హ‌రీష్ రావు లేఖ‌

హైద‌రాబాద్ – తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార, విపక్షాల మధ్య మాట‌ల యుద్దం ఓ రేంజ్‌లో సాగింది. తాజాగా వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు మళ్లీ రేప‌టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ సర్కార్ శాఖలవారీగా శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తామని చెబుతుండటంతో బీఆర్ఎస్ కూడా అందుకు స‌మాధానం చెప్పేందుకు అన్ని విధాల సంసిద్ద‌మ‌వుతున్న‌ది.. ఈ నేప‌థ్యంలో తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి అనుమతి మంజూరు చేయాలంటూ ఆ లేఖలో అభ్య‌ర్ధించారు.


”రేపటి నుంచి జరిగే శాసనసభ సమావేశాలలో ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం ఉంది. ఒక వేళ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతించినట్లైతే, దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు సభ ద్వారా మా వెర్షన్ చెప్పవలసి ఉంటుంది. మేము కూడా సభలో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కావున భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షానికి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వగలరని మనవి.” అంటూ స్పీకర్ కు లేఖలో వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement