Monday, April 29, 2024

బి.ఎన్.రెడ్డి నగర్ లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన


ఎల్బీనగర్ ఆగస్టు 9 (ప్రభ న్యూస్) శివారు ప్రాంత కాలనీలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. బుధవారం బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలోసుమారు నాలుగు కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.

గాయత్రీ నగర్ కాలనీ పేజ్ -4 అధ్యక్షులు గౌరీశెట్టి మనోజ్ కుమార్ ,ప్రధాన కార్యదర్శి వై. రవికుమార్ లు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంత కాలనీలపై ప్రత్యేక దృష్టి సాధించి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement