Saturday, April 27, 2024

విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు విస్తృతంగా పర్యటించారు. శనివారం  రాత్రి ముకునూరు గిరిజన అశ్రమ పాఠశాలలో బస చేశారు. ఆదివారం ఉదయం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం అందించే భోజనం నాణ్యతను స్వయంగా వారితో తిని తెలుసుకున్నారు. పరిశుభ్రతను పాటిస్తు క్రమశిక్షణతో విద్యాను అభ్యసించి లక్ష్యాలను సాధించి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని విద్యార్థులకు ఎమ్మెల్యే  సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement