Wednesday, May 8, 2024

basara: త్రిబుల్ ఐటీని సందర్శించిన ఎమ్మెల్యే రామారావు పటేల్

బాసర, జనవరి 5 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక త్రిబుల్ ఐటీ యూనివర్సిటీని సోమవారం ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ విద్యార్థుల హాస్టల్, మెస్ లను పరిశీలించారు. హాస్టల్ గదుల్లోని విద్యార్థులు నేలపై బెడ్ వేసుకొని పడుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాత్రూములు మురికి కూపంగా ఉండడంపై సంబంధిత అధికారుల వివరణ కోరారు.

విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… యూనివర్సిటీలోని విద్యార్థులకు విద్య, భోజనం, వైద్యం, వసతిపై సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ ను విద్యార్థులకు అందించారు. యూనివర్సిటీలోని అక్రమాలపై త్వరలోనే విజిలెన్స్ కమిటీ వేయిస్తానని, విద్యార్థులకు సమస్యలు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. యూనివర్సటిలోని విద్యార్థుల సమస్యలపై సైతం ఒక కమిటీని ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. వీరి వెంట ఎంపీపీ సునీత విశ్వనాథ్ పటేల్, జెడ్ పి టి సి వసంతా రమేష్, స్థానిక నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement