Friday, April 26, 2024

మృతుల కుటుంబాల‌కు అండ‌గా.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట, వరంగల్ జిల్లా : సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన‌ కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిలిచారు. మృతుల్లో ముగ్గురు నర్సంపేట నియోజకవర్గానికి చెందినవారే.. ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ లో మాట్లాడి అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌ణ్ రెడ్డి కోరారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలు స్వగ్రామానికి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ఓదార్చి ధైర్యం చెప్పారు ఎమ్మెల్యే… ఒక్కో కుటుంబానికి వ్యక్తిగతంగా రూ. 50 వేల ఆర్థిక సహాయం అంద‌జేయ‌నున్నారు.నిన్న రాత్రి సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ వెన్నెల, ఖానాపూర్ మండలానికి చెందిన బానోతు శ్రావణి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement