Sunday, April 28, 2024

NLG: లింగయ్య గౌడ్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

పెన్ పహాడ్, ఏప్రిల్ 22 (ప్ర‌భ న్యూస్): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, సూర్యాపేట టీవీ రిపోర్టర్ ఐతబోయిన రాంబాబు తండ్రి ఐతబోయిన లింగయ్య గౌడ్ (80) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇవాళ‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండల పరిధిలోని నాగులపాటి అన్నారంలో లింగయ్య మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంతాపం తెలిపిన వారిలో ఎంపీపీ నెమ్మాది బిక్షం, పీఏసీఎస్ నాతల జానకి రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్, సూర్యాపేట జెడ్పీటీసీ జీడీ బిక్షం, రాపర్తి మహేష్ కుమార్, దనియకుల సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఒగ్గు సోమన్న తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement