Monday, April 29, 2024

మంత్రి మల్లారెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గొంగిడి సునీతా

మంత్రి సిహెచ్ మల్లా రెడ్డి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా కలిశారు. బండకాడపల్లి నుండి తూముకుంట వరకు డబుల్ లైన్ బిటి రోడ్డు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ఆమె మంత్రికి వినతిపత్రం అందజేశారు.  రూ. కోటి 80 లక్షలతో రోడ్డు పూర్తి చేస్తే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉద్దమర్రి, కేశవపురం గ్రామాలకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. అలాగే,  యాదాద్రి భువనగిరి జిల్లాలోని బండకాడపల్లి, తూముకుంట గ్రామాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఈ అంశాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రతిపాదనలు పంపి మంజూరు చేయాలని కోరారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement