Thursday, May 16, 2024

చెల్పూర్ సర్పంచ్ ని పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామ సర్పంచ్ మధుసూదన్ రావు  సోదరుడు వీర రాఘవరావు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఎమ్మెల్యే గండ్ర వెంట  పిఏసీఎస్ చైర్మన్ లు గండ్ర సత్యనారాయణ రెడ్డి, పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement