Monday, April 29, 2024

ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్‌ టీకా వేయించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కోవిడ్‌ టీకాలు వేసే ప్రక్రియను ఎమ్మెల్యే దాసరి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా టీకా తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. గతంలో 18 ఏళ్లు నిండిన వారందరికి ప్రభుత్వం టీకాను పూర్తి చేసిందని, ప్రస్తుతం 15 ఏళ్ల వారి వరకు టీకా వేస్తుందని తెలిపారు. నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్‌ టీకా వేయించుకోవాలని కోరారు. అలాగే కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement