Monday, May 6, 2024

NZB : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం… మహమ్మద్ అలి షబ్బీర్

నిజామాబాద్ సిటీ, నవంబర్ 16(ప్రభ న్యూస్)
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ప్రవేశపెట్టిన ఆరు హామీలను అమలు చేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ అర్బన్ అభ్యర్థి షబ్బీర్ ఆలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి షబ్బీర్ అలీ గురువారం ఉదయం నిజామాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో మార్నింగ్ వాకింగ్ చేస్తూ అక్కడికి వచ్చిన వాకర్స్ తో మాట్లాడారు.

అనంతరం కంటేశ్వర్ రోడ్డుపై టీ స్టాల్ లో టీతాగుతూ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. క్రికెట్, షటిల్ ఆడుతూ అందరితో మమేకమై.. ఉల్లా సంగా… ఉత్సాహంగా.. సరదా గా అందరితో గడిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని ఎంతో అభివృద్ధి జరిగిందని టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి శూన్య మని మండిపడ్డారు. నిజామా బాద్ అర్బన్ లోని సమస్యలన్నీ పరిష్కరించి అభివృద్ధి చేసి చూపిస్తా ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రత్నాకర్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, రామకృ ష్ణ. దయాకర్. నజీబ్ అలి. శరత్.ప్రవీణ్ గౌడ్.వేణుగౌడ్. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement