Friday, April 26, 2024

పేదల సొమ్ము పెద్దలకు దోచిపెడుతున్న ప్ర‌ధాని.. మంత్రి వేముల

నందిపేట్, (ప్రభా న్యూస్): నరేంద్ర మోడీ భారతదేశంలోనే అసమర్థత ప్రధాని అని.. పేదల పొట్టను కొట్టి పెద్దలకు పంచి పెడుతున్నాడని రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు మండపంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కోసమే పేదల కోసం కాదని పేదల కష్టాన్ని దోచుకొని , ఆదాని, అంబానీలకు పెడుతున్నారు అని అన్నారుఅన్నారు. దీంతోపాటు 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ నేడు 1200 రూపాయలకు పెంచార‌న్నారు. అలాగే పెట్రోల్ ధరలు 50 నుండి 110 రూపాయల వరకు పెంచడంతో మధ్యతరగతి కుటుంబీకులకు భారమైందన్నారు.

భారతదేశంలో ఈ రాష్ట్రంలో లేని దళిత బంధు, బీడీ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, రైతుబంధు, తదితర పథకాలను కెసిఆర్ ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు దేశంలోనే ప్రతి రాష్ట్రంలో ప్రారంభించడానికి బిఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుందని, కాంగ్రెస్ పార్టీకి, బిజెపి పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సమాయత్తమయ్యారన్నారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బిజెపి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా అన్నారు ఏదైనా సరే పేద ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న పనులు ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు: ఈ కార్యక్రమంలో: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి, జడ్పిటిసి, ఎర్రం, యమునా,ఎంపీపీ, వాకిడి సంతోష్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement