Sunday, April 28, 2024

అనాధలను అక్కున చేర్చుకుంటాం: మంత్రి తలసాని

అనాధలను కూడా అక్కున చేర్చకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనాధలకు అండగా ఉండేందుకు ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటున్నారని తెలిపారు. గురువారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డాలో గల అనాధ బాలికల ఆశ్రమాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా అనాధ బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే వెంకటేశ్, ఇతర ఉన్నతాధికారులు బాలికలతో కలిసి భోజనం చేశారు. అనాధాశ్రమంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement