Wednesday, May 15, 2024

యాసంగిలో వ‌రిపంట వేయాలా వద్దా ? : మంత్రి శ్రీనివాస్ గౌడ్

యాసంగిలో వ‌రిపంట వేయాలా.. వ‌ద్దా… కేంద్రం సూటిగా చెప్పాల‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ నేతలు ఢిల్లీ లో రైతుల కోసం కాకుండా తమ రాజకీయాల కోసం తమ పెద్దలతో మాట్లా డుతున్నారని.. ధాన్యం సేకరణ పూర్తిగా కేంద్రం భాద్యతే దాన్నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంచి చేస్తే దేశమంతా తిరిగి కేంద్రం మంచి చేసిందని చెబుతాం. చెడు చేస్తే దానికి తగ్గట్టే వ్యవహరిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ మీద కోపం, అధికార దాహంతో బీజేపీ తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆగ్రహించారు.

కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదని.. బీజేపీ నేతలు కుట్ర పన్నారని …వారి కుట్రలను ఛేదిస్తామని హెచ్చరించారు. బీజేపీ ని ఎదుర్కోవడానికి మా వ్యూహం మాకుందన్నారు. మంత్రులను అవమాన పరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీల కోసం వెళతారని… తాము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామని పేర్కొన్నారు. అడుక్కోవడానికి తాము బిచ్చగాళ్ళం కాదు… తెలంగాణ నేతలను బీజేపీ బిచ్చగాళ్లుగా కేంద్రం చూస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement