Saturday, May 4, 2024

 Satyavathi Rathod: మాన‌వ‌త్వం చాటుకున్న మంత్రి స‌త్య‌వ‌తి 

మంత్రి సత్యవతి రాథోడ్ మానవత్వం చాటుకున్నారు. ఆదివారం ఉదయం మంత్రి సత్యవతి తన కాన్వాయ్‌లో మహబూబాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. తొర్రూరు ప్రధాన రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఫిట్స్ రావడంతో కిందపడిపోయారు. అదే ఆ మార్గం గుండా వెళ్తున్న మంత్రి అతడిని గమనించారు.

వెంటనే తన కాన్వాయ్‌ని పక్కకు ఆపి అతడిని పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన అతడికి సపర్యలు చేశారు. వెంటనే అంబులెన్సును పిలిపించి సమీపంలోని దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement