Thursday, May 2, 2024

రోశ‌య్య మృతి ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన మంత్రి స‌బితా

రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకి తీరనిలోటని మంత్రి పేర్కొన్నారు. రోశయ్య మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన రోజులను సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేసుకున్నారు.
ఆయ‌న‌ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement