Tuesday, May 14, 2024

మంత్రి పువ్వాడ క్షేమం.. రెండు రోజుపాటు విశ్రాంతి చాల‌న్న‌ డాక్ట‌ర్లు

యాదాద్రి ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సోమవారం జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తేనెటీగలు దాడిచేసిన విషయం విదితమే. ఆలయ పశ్చిమ గోపురం (సప్తతల గోపురం)పై పూజా క్రతువులో ఉన్న మంత్రి దంపతులతోపాటు (పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి) వేద పండితులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భక్తిభావంతో మహాకుంభ సంప్రోక్షణ పూజా పూర్తి చేశారు. అనంతరం ప్రాథమిక చికిత్స కోసం హైదరాబాద్ కు బయల్దేరివెళ్లారు.

విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తీవ్ర అందోళనకు గురయ్యారు. ఫోన్ ద్వారా మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేశారు. తమ నాయకుడికి ఏమి కావొద్దని, పూర్తి ఆరోగ్యంగా మళ్లీ తిరిగి రావాలని ఆలయాల్లో పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా తేనెటీగ‌ల‌ దాడిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, తాను క్షేమంగా ఉన్నానని మంత్రి పువ్వాడ ట్విట్టర్ ద్వారా పేర్కోన్నారు. వైద్యుల సూచనల మేరకు రెండు రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పారని వివరించారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నెమ్మదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement