Monday, April 29, 2024

TS : హాఫ్ మారథాన్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో హాఫ్ మారథాన్‌ను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న 5కే ర‌న్‌లో పాల్గొన్నారు. హన్మకొండ ,కరీంనగర్ , సిద్దిపేట నుంచి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని కోరారు.

మెట్రో పాలిటన్ నగరాల్లో మాత్రమే నిర్వహించే హాఫ్ మారథాన్‌ను హుస్నాబాద్ లో ప్రారంభించడం సంతోషకరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భవిష్యత్ లో కూడా దీనిని కొనసాగించాలని కోరారు. నిర్వాహకులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్ లో జరిగే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హుస్నాబాద్ కేంద్రం నుండి జరిగే ఈ పోటీల్లో స్థానికులు ఎక్కువగా పాల్గొనే విధంగా స్ఫూర్తి దాయకంగా ప్రోత్సాహిస్తామన్నారు. 10 కే ,21 కే కూడా ప్రోత్సాహించాలని తెలిపారు. పరుగు పందెంలో గెలిచిన వారికి అభినందనలు ఒడిన వారు మరింత స్ఫూర్తితో పాల్గోనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement