తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎదురుదెబబ్బ తగిలింది. మేడ్చల్ మండలం గౌడవెళ్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. గ్రామ సమస్యలపై చర్చించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అవడంతో గ్రామ అభివృద్ధికి మేడ్చల్ ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి సహకరించడం లేదని ప్రజల ఆరోపించారు. గౌడవెళ్లి గ్రామసభ అధికార పార్టీ మీటింగ్ గా మారిందని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో అన్ని సమస్యలు తీరవని మంత్రి అనడం విడ్డూరంగా ఉందని స్థానిక ప్రజలు అన్నారు. మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి నివేదికను సర్పంచ్ తన వద్ద చర్చించమని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
ఇది కూడా చదవండి: ఏపీలో థియేటర్లు ఓపెన్.. తెలంగాణ సంగతేంటి?