Thursday, May 2, 2024

నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న

తెలంగాణ‌ రాష్ట్ర‌ మంత్రి కేటీఆర్ ఈరోజు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని జూనియర్‌ కాలేజీలో నిర్వహించనున్న వజ్రోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడకు చేరుకుంటారు. ఆలయ చెరువు మైదానంలో జరుగనున్న వజ్రోత్సవ వేడుకలకు హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడ‌నున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement