Thursday, April 25, 2024

Breaking : కాలేజ్ బ‌స్ ను ఢీ కొన్న లారీ-ఇంజ‌నీరింగ్ విద్యార్థుల‌కు గాయాలు

ప్రకాశం : సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద యన్ ఇ సి కాలేజీ బస్ ను ఢీ కొంది లారీ.వినుకొండ నుంచి నరసరావుపేట ఇంజనీరింగ్ (NEC) కాలేజీ కి విద్యార్ధులతో వెళుతోంది ఈ బస్సు. కాగా బస్ లో సుమారు 40 మంది విద్యార్థులు ప్ర‌యాణిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో పలువురికి గాయాలు అయ్యాయి. గాయాల‌పాలైన విద్యార్థులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అద్దంకి నుండి పిడుగురాళ్ల వైపు వెళ్తున్న లారీ అతివేగంతో రావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు సంతమాగులూరు పోలీసులు.కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement