Monday, April 15, 2024

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్-వైసీపీ నుంచి కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి నామినేష‌న్

ఈ రోజు ఉద‌యం నుండి సాయంత్రం వ‌ర‌కు ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికోసం నామినేష‌న్స్ ని స్వీక‌రించ‌నున్నారు. ఈ మేర‌కు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేస్తున్నట్టు సమాచారం. ఆయన ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు నామినేషన్ వేస్తారని చెపుతున్నారు. సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సభలో ఉన్న బలాబలాల నేపథ్యంలో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపకపోవచ్చు. డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి నిన్న రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం వెంటనే ఆమోదించారు. దీంతో ఖాళీ అయిన డిప్యూటీ స్పీకర్ పదవికి ఇప్పుడు ఎన్నిక జరగబోతోంది. ఇంకోవైపు, డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి ఎందుకు రాజీనామా చేశారనే విషయం మాత్రం ఇంత వరకు తెలియలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement