Sunday, April 28, 2024

బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తిదేవిని ద‌ర్శించుకున్న.. మంత్రి కేటీఆర్ త‌న‌యుడు

బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తిదేవిని త‌న స్నేహితుల‌తో క‌లిసి ద‌ర్శించుకున్నారు మంత్రి కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షురావు.
ఈ సందర్భంగా గోదావరి బ్రిడ్జి వద్ద ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి , బీఆర్‌ఎస్‌ శ్రేణులు హిమాన్సుకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆలయం వద్ద ఆలయ పండితులు హిమాన్సుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించి , అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. మహంకాళి ఆలయం వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం యాదగిరిగుట్టకు బయలు దేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement