Sunday, April 28, 2024

KTR: షాద్‌నగర్‌ లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన‌ మంత్రి కేటీఆర్

రంగారెడ్డి: రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని కొల్లూరులో నిర్మించిన మున్సిపల్‌ కార్యాలయ భవనం, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంత్రి మహేందర్‌ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.

అనంతరం షాద్‌నగర్‌లో 1700 డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అలాగే బంజారా భవన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం షాద్‌నగర్‌ మార్కెట్‌ యార్డులో జరిగే సభలో పాల్గొంటారు. అనంత‌రం మధ్యాహ్నం రావిర్యాలలో విజయ మెగా డెయిరీని ప్రారంభిస్తారు. తర్వాత వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో గిరిజన భవన్‌, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పట్టణంలోని బ్లాక్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement