Sunday, April 28, 2024

దళితుల జీవితాల్లో వెలుగులు.. దళితబంధు యూనిట్ల పంపిణీ

దళితబంధుతో దళితుల జీవితాల్లో మార్పు రానుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం కరీంనగర్ లోని అంబెడ్కర్ స్టేడియంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్నల్ లు దళిత బందు లబ్దిదారులకు యూనిట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ దళిత బంధు కింద చాలా యూనిట్స్ మంజూరు అయ్యాయని అన్నారు. డ్రైవర్లుగా ఉన్న దళిత సోదరులు ఓనర్లు అవుతున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున దళిత బంధు కింద వాహనాలు అందించడం ద్వారా దళితుల జీవితాల్లో మార్పు రానుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి పథకం ఎక్కడా లేదన్నారు.

మంత్రి గంగుల కమాలాకర్ మాట్లాడుతూ.. దళితబంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. దళితల గురించి ఆలోచన చేసి దళిత అభ్యున్నతికి సీఎం కేసీఆర్ తోడ్పాటు ఇచ్చారని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement