Sunday, April 28, 2024

యాసంగి పంటను కొనాలి: కేంద్రానికి మంత్రి గంగుల డిమాండ్

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొట్టపల్లి కేంద్రంలో ధాన్యం కొనుగోలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రైతు బంధు, 24 గంటల కరెంట్, కాళేశ్వరం జలాలతో తెలంగాణలో పంట దిగుబడి పెరిగింది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరిందన్నారు. వానాకాలం పంట ప్రతి గింజ కొంటామని, ఆ దిశగా కేంద్రంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,540 ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 1,762 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అధికారులు సూచించిన తేదీల్లో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. యాసంగిలో సాగయ్యే ప్రతి పంటను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యాసంగి పంటను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్.సి.ఐ బేషరతుగా కొనాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపి బండి సంజయ్ కుమార్ యాసంగి పంటను కొనెలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement