Thursday, May 2, 2024

రోశయ్య మంచి మాటకారి: మంత్రి ఎర్రబెల్లి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా అనేక పదవులు అలంకరించారని అన్నారు. మంచి మాట కారి అయిన ఆయన.. తనదైన నుడికారం, వ్యంగమైన వ్యాఖ్యలతో అందరి మన్ననలు పొందారని చెప్పారు. సుదీర్ఘంగా వ్యక్తిగత, రాజకీయ, సంపూర్ణ జీవితాన్ని అనుభవించారన్నారు. రోశయ్య లేని లోటు తీర్చలేనిదని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. రోశయ్య కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement