Friday, May 3, 2024

రోశయ్యకు సీఎం కేసీఆర్ నివాళి

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతిక కాయానికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి సీఎం.. రోశయ్య పార్థివదేహం వద్ద పుష్పగుచ్చంఉంచి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు.

కాగా, అనారోగ్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం రోశయ్య శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రేపు ప్రభుత్వ లాంఛనాలతో హైదరాబాద్ కొంపల్లిలో ఉన్న ఫామ్ హౌస్ లో రోశయ్య అంత్యక్రియులు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement